హరీష్ శంకర్-పవన్ కళ్యాణ్ కాంబినేషన్లో రూపొందిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఈ నెల 19న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. కనుక రేపు (అదివారం) సాయంత్రం హైదరాబాద్, యూసఫ్గూడాలోని పోలీస్ గ్రౌండ్స్లో నిర్వహించబోతున్నట్లు హరీష్ శంకర్ ప్రకటించారు. ‘ఈసారి ఈవెంట్ బద్దలైపోవాలి ఫ్రెండ్స్’ అని అభిమానులకు విజ్ఞప్తి చేశారు.
ఈరోజు సాయంత్రమే ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ట్రైలర్ విడుదల కాబోతోంది. కనుక ట్రైలర్ నచ్చితే రేపు ప్రీ-రిలీజ్ ఈవెంట్కి మరింత మంది జనం పోటెత్తడం ఖాయమే.
ఈ సినిమాలో శ్రీలీల, రాశీ ఖన్నా హీరోయిన్లుగా చేస్తున్నారు. ఇది పవన్ కళ్యాణ్-హరీష్ శంకర్ సూపర్ హిట్ కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడం, ప్రస్తుతానికి ఇదే పవన్ కళ్యాణ్ చివరి సినిమా కావడంతో దీనిపై అభిమానులు చాలా ఆశలు పెట్టుకున్నారు.
ఈ సినిమాలో సాక్షి వైద్య, అశుతోష్ రానా, పార్ధిబన్, నవాబ్ షా, గౌతమి, చమ్మక్ చంద్ర, అవినాష్, గిరి, నాగ మహేష్ బాబు, నర్రా శ్రీను, టెంపర్ వంశీ ముఖ్యపాత్రలు చేస్తున్నారు.
ఈ సినిమాకి కధ, దర్శకత్వం: హరీష్ శంకర్, స్క్రీన్ ప్లే: కె.దశరద్, రమేష్ రెడ్డి, సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, కెమెరా: ఆయాంకా బోస్, ఎడిటింగ్: కార్తీక శ్రీనివాస్, ఫైట్స్: రామ్ లక్ష్మణ్, నబకంత, పృధ్వీ చేస్తున్నారు.
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్పై నవీన్ ఎర్నేని, రవి శంకర్ యలమంచిలి కలిసి నిర్మిస్తున్న‘ఉస్తాద్ భగత్ సింగ్ మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది.