RRR నిర్మాత మరో క్రేజీ కాంబో సెట్ చేస్తున్నాడా..?

June 09, 2021


img

ఎన్.టి.ఆర్, రాం చరణ్, రాజమౌళి కలిసి చేస్తున్న భారీ ప్రాజెక్ట్ ఆర్.ఆర్.ఆర్ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఈ సినిమాను డివివి దానయ్య 400 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా తర్వాత దానయ్య మరో క్రేజీ ప్రాజెక్ట్ సిద్ధం చేస్తున్నాడని తెలుస్తుంది. సూపర్ స్టార్ మహేష్, కె.జి.ఎఫ్ డైరక్టర్ ప్రశాంత్ నీల్ తో దానయ్య మూవీ ప్లాన్ లో ఉన్నారట.

ప్రస్తుతం కె.జి.ఎఫ్ పార్ట్ 2 రిలీజ్ కు రెడీ అవుతుంది. ఆ సినిమా తర్వాత ప్రశాంత్ నీల్ ప్రభాస్ తో సలార్ సినిమా చేస్తున్నాడు. ప్రభాస్ మూవీ పూర్తి కాగానే ఎన్.టి.ఆర్ మూవీ కూడా లైన్ లో ఉంది. ఈ రెండు సినిమాల తర్వాత మహేష్ తో సినిమా ఉండే ఛాన్స్ ఉందని అంటున్నారు. కె.జి.ఎఫ్ చాప్టర్ 1 తో టాలీవుడ్ ఫేవరేట్ డైరక్టర్ గా మారాడు ప్రశాంత్ నీల్. కె.జి.ఎఫ్ చాప్ట 2 పూర్తి కావడమే ఆలస్యం వరుసగా తెలుగు హీరోలతో సినిమాలు ఫిక్స్ చేసుకున్నాడు. మహేష్, ప్రశాంత్ నీల్ కాంబో ఫిక్స్ అయితే మాత్రం సూపర్ స్టార్ ఫ్యాన్స్ కు పండుగ అన్నట్టే.



Related Post

సినిమా స‌మీక్ష