బండి భగీరథ్‌కు మధ్యంతర బెయిల్‌ మంజూరు

June 20, 2026


img

మే 16న పోక్సో కేసులో అరెస్ట్ అయ్యి చర్లపల్లి జైలుకి వెళ్ళిన బండి భగీరథ్‌కు మేడ్చల్- మల్కాజ్‌గిరి న్యాయస్థానం నేడు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసింది.  ఇంజనీరింగ్ పరీక్షలకు హాజరయ్యేందుకుగాను బెయిల్‌ మంజూరు చేయాలని కోరుతూ బండి భగీరథ్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై న్యాయస్థానం సానుకూలంగా స్పందిస్తూ ఈ నెల 26వరకు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసింది. 

అయితే బెయిల్‌పై  బయటకు వెళ్ళినప్పుడు బాధితులను, సాక్షులను కలవడం లేదా బెదిరించడం చేయరాదని, కేసు విచారణని ప్రభావితం చేసే ఎటువంటి పనులు చేయరాదని, మీడియాకి ఇంటర్వ్యూ ఇవ్వరాదంటూ కొన్ని షరతులు విధించింది. తప్పనిసరిగా ఈ షరతులు పాటించాలని ఆదేశించింది. మళ్ళీ ఈ నెల 27న స్వయంగా వచ్చి పోలీసులకు లొంగిపోవాలని న్యాయస్థానం సూచించింది. 

ఈ షరతులకు వాటికి బండి భగీరథ్‌ తరపు న్యాయవాది అంగీకరించడంతో ఈ నెల 26వరకు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసింది. జైలు అధికారులకు న్యాయస్థానం నుంచి బెయిల్‌ ఉత్తర్వులు అందడంతో వాటిని పరిశీలించిన తర్వాత శనివారం మధ్యాహ్నం బండి భగీరథ్‌ని చర్లపల్లి జైలు నుంచి విడుదల చేశారు. 



Related Post