దేశవ్యాప్తంగా పది రాష్ట్రాలలో ఖాళీ అవుతున్న24 రాజ్యసభ సీట్ల భర్తీకి కేంద్ర ఎన్నికల కమీషన్ నేడు ఎన్నికల షెడ్యూల్ ప్రకటించింది. జూన్ 18న ఎన్నికలు నిర్వహించబోతోంది.
వీటికి జూన్ 1న ఎన్నికల నోటిఫికేషన్ వెలువడుతుంది. ఆరోజు నుంచి జూన్ 8 వరకు నామినేషన్స్ దాఖలు చేయవచ్చు. నామినేషన్స్ పరిశీలన- జూన్ 9న, నామినేషన్స్ ఉపసంహరణ గడువు- 11 వరకు, పోలింగ్- జూన్ 18న జరుగుతుంది.
పోలింగ్ ముగియగానే అదే రోజు సాయంత్రం ఓట్లు లెక్కించి ఫలితాలు వెల్లడిస్తారు. జూన్ 20వ తేదీతో రాజ్యసభ ఎన్నికల ప్రక్రియ పూర్తవుతుంది.
తెలంగాణలో రాజ్యసభ ఎన్నికలు లేవు. కానీ పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో 4 సీట్లకు ఎన్నికలు జరుగబోతున్నాయి. రాజ్యసభ సభ్యులను ఎమ్మెల్యేలు ఎన్నుకుంటారు. కనుక ఎమ్మెల్యేల బలం ఉన్న టీడీపి, జనసేన, బిజేపిలే నాలుగు సీట్లు పంచుకుంటాయి.