రెండు రోజుల క్రితం జమ్ము కశ్మీర్లో పర్యటకులపై ఉగ్రవాదుల దాడిని కేంద్ర ప్రభుత్వం చాలా తీవ్రంగా పరిగణించింది. ఇందుకు ప్రతి చర్యగా పలు కఠిన నిర్ణయాలు తీసుకుంది. ప్రధాని మోడీ అధ్యక్షతన భద్రత వ్యవహారాల కమిటీ బుధవారం సాయంత్రం సమావేశమయ్యింది. దీనిలో కేంద్ర హోం, రక్షణ, విదేశాంగ శాఖల మంత్రులు, అమిత్ షా, రాజ్నాధ్ సింగ్, జై శంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోభల్, మంత్రిత్వ శాఖల కార్యదర్శులు హాజరయ్యారు. ఉగ్ర దాడి గురించి చర్చించిన తర్వాత కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
పంజాబ్లోని అటారీ వద్ద భారత్-పాకిస్థాన్ సరిహద్దు మద్య వాఘా బోర్డర్ గేట్లని మూసివేయాలని, పాక్ నుంచి ఎవరినీ దేశంలోకి అనుమతించకూడదని నిర్ణయించారు.
సార్క్ వీసా మినహాయింపు పధకం ద్వారా భారత్లో పర్యటిస్తున్న పాకిస్థాన్ జాతీయులు అందరూ మే 1 వ తేదీలోగా తిరిగి వెళ్లిపోవాలి.
భారత్లో పాక్ దౌత్య కార్యాలయంలో పనిచేస్తున్న పాక్ అధికారులు, పాక్ సైనిక సిబ్బందిని అవాంఛిత వ్యక్తులుగా ప్రకటన. సిబ్బంది సంఖ్యని 55 నుంచి 30 కి తగ్గించి మిగిలినవారందరూ వారం రోజులలోగా దేశం విడిచి వెళ్లిపోవాలని ఆదేశం.
పాక్తో సింధూ నదీ జలాల ఒప్పందం నిలిపివేయాలని నిర్ణయించారు.