తెలంగాణ కాంగ్రెస్‌ గెలుపు తధ్యం: ఇండియా టుడే

December 02, 2023


img

తెలంగాణలో పోలింగ్‌ ముగిసిన వెంటనే దాదాపు 16 మీడియా, సర్వే సంస్థలు ఎగ్జిట్ పోల్స్ ప్రకటించాయి. వాటిలో అత్యధికం కాంగ్రెస్ పార్టీ గెలిచి అధికారంలోకి రాబోతోందని పేర్కొన్నాయి. కొన్ని మాత్రం బిఆర్ఎస్ పార్టీ భారీ మెజారిటీతో గెలుస్తుందని, మరికొన్ని రెండు పార్టీలకు సరిసమానంగా సీట్లు రావచ్చని తమ అంచనాలను పేర్కొన్నాయి.    

చిట్టచివరిగా ప్రముఖ జాతీయ పత్రిక ఇండియా టుడే-యాక్సిస్ మై ఇండియాతో కలిసి చేసిన సర్వే నివేదికను ప్రకటించింది. అవి కూడా కాంగ్రెస్ పార్టీ పూర్తి మెజారిటీతో గెలిచి తెలంగాణలో అధికారంలోకి రాబోతోందని పేర్కొన్నాయి. 

ఇండియా టుడే-యాక్సిస్ మై ఇండియా సర్వే నివేదిక ప్రకారం...  
ఉత్తర తెలంగాణ జిల్లాలో బిఆర్ఎస్ పార్టీకి 13, కాంగ్రెస్ పార్టీకి 15, బీజేపీకి 5 సీట్లు,  
దక్షిణ తెలంగాణ జిల్లాలలో బిఆర్ఎస్ పార్టీకి 6, కాంగ్రెస్ పార్టీకి 27, బీజేపీకి ఒక సీటు,  
సెంట్రల్ తెలంగాణ జిల్లాలలో బిఆర్ఎస్ పార్టీకి 9, కాంగ్రెస్ పార్టీకి 22 సీట్లు, 
హైదరాబాద్‌లో బిఆర్ఎస్ పార్టీకి 11, కాంగ్రెస్ పార్టీకి 3, బీజేపీకి 1, మజ్లీస్‌కు 6 సీట్లు గెలుచుకొనే అవకాశం ఉంది. 

Related Post