రాజాసాబ్ సహనా సహనా... సాంగ్ వచ్చేసింది

December 17, 2025


img

మారుతి-ప్రభాస్‌ కాంబినేషన్‌లో రెడీ అవుతున్న ‘రాజాసాబ్’ నుంచి 'సహనా సహనా' అంటూ సాగే పాట నేడు విడుదల చేశారు. దర్శకుడు మారుతి వ్రాసిన ఈ పాటకి తమన్ చక్కటి సంగీతం అందించి విశాల్ మిశ్రా, శ్రుతి రంజనిలతో కలిసి పాడారు.  

ఈ సినిమాలో ప్రభాస్‌కు జోడీగా నిధి అగర్వాల్, మాళవిక మోహనన్ హీరోయిన్లుగా నటించారు. బాలీవుడ్ నటుడు సంజయ్ దత్, జరీనా వాహబ్, రిద్ధి కుమార్‌ తదితరులు ముఖ్యపాత్రలు చేశారు.  

రాజాసాబ్ సినిమాకు సంగీతం: ఎస్ఎస్ తమన్, కెమెరా: కార్తీక్ పళని, ఆర్ట్ డైరెక్టర్: రాజీవన్, ఎడిటింగ్: కోటగిరి వేంకటేశ్వర రావు చేశారు. 

జనవరి 9న సంక్రాంతి పండగకు ముందు విడుదల కాబోతోంది. కనుక ఈ నెల 27న రాజాసాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కానీ ఎక్కడ నిర్వహించాలనేది ఇంకా నిర్ణయించాల్సి ఉంది. 

 పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో పాన్ ఇండియా మూవీగా నిర్మించారు. 

<iframe width="560" height="315" src="https://www.youtube.com/embed/2cF8x6Mhgj4?si=ttReS8_MFZRKLzYq" title="YouTube video player" frameborder="0" allow="accelerometer; autoplay; clipboard-write; encrypted-media; gyroscope; picture-in-picture; web-share" referrerpolicy="strict-origin-when-cross-origin" allowfullscreen></iframe>

Related Post

సినిమా స‌మీక్ష