బాలీవుడ్ దర్శకుడు నితీశ్ తివారీ దర్శకత్వంలో బాలీవుడ్ నటుడు రణబీర్ కపూర్, సాయి పల్లవి సీతారాములుగా ‘రామాయణ’ పేరుతో సినిమాని తెరకెక్కిస్తున్నారు. దీనిని చాలా బారీ బడ్జెట్తో మూడు భాగాలుగా తీయబోతున్నారు.
ఈ సినిమా షూటింగ్ ఇటీవలే ప్రారంభమైంది. దీనిలో నటిస్తున్న నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు ఇంకా ప్రకటించక ముందే సీతారాముల వేషధారణలో రణబీర్ కపూర్, సాయి పల్లవిల ఫోటో ఒకటి బయటకు లీక్ అయ్యింది. దీంతో దర్శకుడు నితీశ్ తివారీ లొకేషన్లో మరిన్ని ఆంక్షలు విధించారు.
రామాయణ మొదటి భాగం బాలకాండ నుంచి అయోధ్యా కాండ వరకు, రెండో భాగంలో అరణ్య కాండ నుంచి కిష్కింద కాండ వరకు, మూడో భాగంలో కిష్కింద కాండ నుంచి యుద్ధకాండ, శ్రీరామపట్టాభిషేకం వరకు చూపబోతున్నట్లు సమాచారం.
ఈ సినిమా నిర్మాణంలో భాగస్వామిగా కూడా ఉన్న యష్, రావణాసురుడిగా నటిస్తున్నారు. ఈ సినిమాలో నవీన్ పోలిశెట్టి, రకుల్ ప్రీత్ సింగ్ ముఖ్య పాత్రలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు సంబందించి మరిన్ని వివరాలు త్వరలోనే ప్రకటించనున్నారు.
రామాయణ మొదటి భాగం వచ్చే ఏడాది దసరా, దీపావళి పండుగ సీజనులో ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది.