మహేష్ ఇంకా పెండింగ్ లోనే ఉంచాడట..!

December 07, 2017


img

నందమూరి బాలకృష్ణ సూపర్ స్టార్ మహేష్ కలిసి బోయపాటి శ్రీను డైరక్షన్ లో ఓ మల్టీస్టారర్ మూవీ చేస్తున్నారని టాక్ వచ్చింది. ప్రస్తుతం బోయపాటి శ్రీను రాం చరణ్ తో మూవీకి సిద్ధమవుతుండగా ఆ సినిమా తర్వాత బాలయ్య, మహేష్ మల్టీస్టారర్ సినిమా ఉంటుందని అంటున్నారు. అయితే ఈ సినిమాకు బాలయ్య ఓకే చెప్పగా మహేష్ ఇంకా పెండింగ్ లోనే ఉంచాడని తెలుస్తుంది.

మహేష్ ప్రస్తుతం భరత్ అను నేను సినిమా చేస్తున్నాడు. కొరటాల శివ డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమా భారీ అంచనాలతో వస్తుంది. ఇక ఈ సినిమా తర్వాత వెంటనే వంశీ పైడిపల్లి సినిమా కూడా లైన్ లోనే ఉంచాడు మహేష్. ఈ రెండు సినిమాల ఫలితాలను బట్టి మహేష్ బోయపాటి మల్టీస్టారర్ పై నిర్ణయం చెబుతా అని చెప్పాడట. ప్రస్తుతం అర్జెంట్ గా హిట్ కొట్టాల్సిన అవసరం ఉన్న మహేష్ కొరటాల శివ సినిమా మీద పూర్తి నమ్మకంతో ఉన్నాడు.



Related Post

సినిమా స‌మీక్ష