క్రేజీ కాంబో.. మహేష్ తో వినాయక్..!

November 22, 2017


img

స్పైడర్ ఫ్లాప్ తర్వాత దూకుడు పెంచిన మహేష్ ప్రస్తుతం కొరటాల శివతో భరత్ అను నేను సినిమా చేస్తున్నాడు. ఇక ఆ సినిమా పూర్తి కాకుండానే వంశీ పైడిపల్లితో సినిమా షురూ చేశాడు. దిల్ రాజు అశ్వనిదత్ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమా 2018 సమ్మర్ లో స్టార్ట్ కానుందట. ఇక ఈ సినిమా తర్వాత అసలైతే త్రివిక్రంతో సినిమా ఉంటుందని తెలుస్తుంది. అయితే మరో పక్క రాజమౌళి సినిమా కూడా ఉంటుందని అన్నారు.

ఇవే కాకుండా మహేష్ తో వినాయక్ సినిమాకు సిద్ధమవుతున్నాడట. ఖైది నంబర్ 150 తర్వాత కొద్దిపాటి గ్యాప్ తో సాయి ధరం తేజ్ తో సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా తర్వాత మహేష్ తో సినిమాకు ప్లాన్ చేస్తున్నాడట. ఈ కాంబినేషన్ లో సినిమా వస్తే ఇక రికార్డులే అంటున్నారు అభిమానులు. కాంబినేషన్ లో సినిమా ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.



Related Post

సినిమా స‌మీక్ష