ఆడాళ్లూ మీకు జోహార్లు అంటున్న శర్వానంద్..!

October 23, 2020


img

యువ హీరో శర్వానంద్ కిశోర్ తిరుమల డైరక్షన్ లో వస్తున్న సినిమా ఆడాళ్లూ మీకు జోహార్లు. ఈ సినిమాను దసరా సందర్భంగా అక్టోబర్ 25న తిరుపతిలో ముహుర్తం పెట్టనున్నారు. నేను శైలజ, ఉన్నది ఒకటే జిందగి, చిత్రలహరి సినిమాలతో డైరక్టర్ గా తన సత్తా చాటిన కిశోర్ తిరుమల ప్రస్తుతం రామ్ హీరోగా రెడ్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా రిలీజ్ కు రెడీగా ఉంది.

ఆడాళ్లూ మీకు జోహార్లు అంటూ శర్వానంద్ తో ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమా చేస్తున్నాడు కిశోర్ తిరుమల. ఈ సినిమాను శ్రీ లక్ష్మి వెంకటేశ్వర బ్యానర్ లో సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. జానుతో ఈ ఇయర్ మొదట్లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన శర్వానంద్ ప్రస్తుతం శ్రీకారం సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత ఆడాళ్లూ మీకు జోహార్లు ఫిక్స్ చేసుకున్నాడు.  



Related Post

సినిమా స‌మీక్ష