స్టార్ హీరోయిన్ అనుష్క నటించిన ఓ సినిమా రిలీజ్ కన్ ఫ్యూజన్ లో పడుతుందని ఎవరు ఎప్పుడు ఊహించి ఉండరు. భాగమతి తర్వాత అనుష్క నటించిన సినిమా నిశ్శబ్ధం. కోనా వెంకట్ నిర్మించిన ఈ సినిమాను హేమంత్ మధుకర్ డైరెక్ట్ చేశారు. ఈ సినిమా రిలీజ్ టైంకు కరోనా వల్ల లాక్ డౌన్ చేయడంతో సినిమా రిలీజ్ వాయిదా పడ్డది. పరిస్తితి చూస్తుంటే ఇప్పుడప్పుడే థియేటర్లు ఓపెన్ అయ్యేలా లేవు అయితే నిశ్శబ్ధం సినిమాను ఎక్కడ రిలీజ్ చేయాలనే ఆలోచనతో నిర్మాత కోనా వెంకట్ ఆడియెన్స్ కే ఓ ఇంట్రెస్టింగ్ పోల్ పెట్టాడు.
నిశ్శబ్ధం సినిమాను ఎక్కడ చూడాలని అనుకుంటున్నారు అంటూ 3 ఆప్షన్స్ ఇచ్చాడు. అందులో ఒకటి థియేటర్, రెండోది ఓటిటి, మూడవది ఎక్కడైనా. అయితే ఇందులో 50 శాతానికి పైగా ఓటిటికి ఓట్ వేశారు. అంటే నిశ్శబ్ధం సినిమా ఓటిటి రిలీజ్ కు ఆడియెన్స్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టు తెలుస్తుంది. మరి పోల్ పెట్టి సైలెంట్ అవుతారా ఆ రిజల్ట్ ఆధారంగా నిశ్శబ్ధం సినిమా ఓటిటి రిలీజ్ చేస్తారా అన్నది తెలియాల్సి ఉంది.
We Thank you for ur feedback.. We will do our best to satisfy everyone and ur co-operation is very valuable to our team 🙏 pic.twitter.com/uh5giD042R