AA21.. బిగ్ ఎనౌన్స్ మెంట్ వచ్చేసింది..!

July 31, 2020


img

కొన్నాళ్ళుగా వార్తల్లో ఉంటున్న కొరటాల శివ, అల్లు అర్జున్ కాంబో మూవీ అఫిషియల్ ఎనౌన్స్ మెంట్ వచ్చింది. అల వైకుంఠపురములో సక్సెస్ తో ఫుల్ జోష్ లో ఉన్న అల్లు అర్జున్ తన నెక్స్ట్ సినిమా సుకుమార్ తో చేస్తున్నాడు. పుష్ప టైటిల్ తో వస్తున్న ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యారు. ఇక ఈ మూవీ తర్వాత కొరటాల శివ డైరక్షన్ లో సినిమా ఉంటుందని తెలుస్తుంది. మిర్చి నుండి భరత్ అనే నేను వరకు సినిమా తీస్తే హిట్టే అనేంతటి క్రేజ్ తెచ్చుకున్న కొరటాల శివ, తన ప్రతి సినిమాలో సోషల్ మెసేజ్ కచ్చితంగా ఉండేలా చూసుకుంటాడు.

ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవితో ఆచార్య సినిమా చేస్తున్న కొరటాల శివ అల్లు అర్జున్ తో క్రేజీ ప్రాజెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమా ఎనౌన్స్ మెంట్ తో పాటుగా సినిమాకు సంబందించిన ప్రీ లుక్ తో సర్ ప్రైజ్ చేశారు చిత్రయూనిట్. నది ఒడ్డున ఉండి అవతల ఒడ్డున ఉన్న ఊరిని చూస్తున్న ఓ ఇద్దరు వ్యక్తులతో ఈ పోస్టర్ సినిమాపై ఆసక్తిని పెంచింది. ఈ సినిమా కథ ఎలా ఉండబోతుంది.. సినిమాలో హీరోయిన్ ఎవరు..? మిగతా విషయాలన్ని త్వరలో వెళ్ళడిస్తారని తెలుస్తుంది. 

 


Related Post

సినిమా స‌మీక్ష