ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ 'రేడియేషన్'

June 05, 2020


img

కెజిఎఫ్ తో డైరక్టర్ గా తన స్టామినా ఏంటో ప్రూవ్ చేసిన ప్రశాంత్ నీల్ ప్రస్తుతం కెజిఎఫ్ చాఫ్టర్ 2 పూర్తి చేసే పనిలో ఉన్నాడు. ఆ సినిమా తర్వాత ప్రశాంత్ నీల్ టాలీవుడ్ స్టార్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో సినిమా చేస్తాడని తెలుస్తుంది. మైత్రి మూవీ మేకర్స్ ఈ మూవీని నిర్మిస్తారని కన్ఫర్మ్ చేశారు. గురువారం పుట్టినరోజు జరుపుకున్న ప్రశాంత్ నీల్ కు మైత్రి మూవీ మేకర్స్ స్పెషల్ బర్త్ డే విషెస్ అందించింది. అంతేకాదు ఎన్టీఆర్ తో చేస్తున్న ప్రాజెక్ట్ క్లూ కూడా ఇచ్చారు. ఈ సినిమా టైటిల్ రేడియేషన్ అని పెట్టబోతున్నారట. 

ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కచ్చితంగా ఈ కాంబినేషన్ లో సినిమా మరో సెన్సేషనల్ అవుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఎన్టీఆర్ ఆర్.ఆర్.ఆర్ పూర్తి కాగానే త్రివిక్రమ్ సినిమా చేస్తాడని వార్తలు వచ్చాయి. అయితే ప్రశాంత్ నీల్ సినిమా ముందు చేసి ఆ తర్వాత త్రివిక్రమ్ సినిమా చేస్తాడని అంటున్నారు. ప్రశాంత్ నీల్ సినిమా కూడా పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కించాలని చూస్తున్నారు. ఈ సినిమాకు సంబందించిన మిగతా డీటెయిల్స్ తెలియాల్సి ఉంది. 



Related Post

సినిమా స‌మీక్ష