కరణం మల్లీశ్వరి బయోపిక్.. కోనా క్రేజీ ఎనౌన్స్ మెంట్..!

June 01, 2020


img

బయోపిక్ సినిమాల హవా నడుస్తున్న ఈ టైం లో మరో ఇంట్రెస్టింగ్ బయోపిక్ తెర మీదకు రానుంది. ఇండియాకు మొదటి ఒలంపిక్ పతాకాన్ని తెచ్చిన వెయిట్ లిఫ్టర్ కకరణం మల్లీశ్వరి జీవిత కథతో సినిమా తెరకెక్కిస్తున్నారు రైటర్ కమ్ ప్రొడ్యూసర్ కోనా వెంకట్. కోనా ఫిలిం కార్పొరేషన్ బ్యానర్ లో ఎంవివి సత్యనారాయణ ఈ సినిమా నిర్మిస్తున్నారు. కరణం మల్లీశ్వరి పుట్టినరోజు సందర్భంగా లేటెస్ట్ గా ఆమె బయోపిక్ మూవీ ఎనౌన్స్ చేశారు. ఈ సినిమాను సంజనా రెడ్డి డైరెక్ట్ చేస్తున్నారు. 

ప్రీ లుక్ పోస్టర్ రిలీజ్ చేసిన ఈ సినిమాలో ఓ లీడింగ్ యాక్ట్రెస్ నటిస్తుందని తెలుస్తుంది. సినిమాకు సంబందించిన మిగతా డీటైల్స్ త్వరలో తెలుస్తాయి. రైటర్ గా సెన్సేషనల్ హిట్స్ అందించిన కోనా వెంకట్ నిర్మాతగా మారి క్రేజీ సినిమాలు చేస్తున్నాడు. ప్రస్తుతం ఆయన నిర్మాణంలో తెరకెక్కిన నిశ్శబ్దం సినిమా రిలీజ్ కు రెడీ అవుతుంది. సినిమాను డైరెక్ట్ గా డిజిటల్ రిలీజ్ చేస్తారని కొందరు అంటున్నారు.   



Related Post

సినిమా స‌మీక్ష