మనం తర్వాత సిని నేపథ్యం ఉన్న మిగిలిన ఫ్యామిలీ హీరోలంతా అలాంటి సినిమా మనకు ఒకటి పడాలని అనుకున్నారు. అప్పటి నుండి ఆ ప్రయత్నాలు చేస్తున్నా సరే సరైన కథ దొరక్క సైలెంట్ అయ్యారు. కరెక్ట్ స్టోరీ వస్తే నందమూరి, దగ్గుబాటి, ఘట్టమనేని ఇలా మూడు ఫ్యామిలీలు కథ కోసం వెతుకుతున్నాయి. లేటెస్ట్ గా దగ్గుబాటి మల్టీస్టారర్ కు రంగం సిద్ధమైందని తెలుస్తుంది.
మలయాళంలో సూపర్ హిట్ అయిన అయ్యప్పనుమ్ కోషియం సినిమా రీమేక్ లో దగ్గుబాటి హీరోలు వెంకటేష్, రానా నటిస్తారని తెలుస్తుంది. హారిక హాసిని బ్యానర్లో ఈ సినిమా వస్తుందని తెలుస్తుంది. మలయాళంలో పృథ్వి రాజ్, బిజు మీనన్ లీడ్ రోల్స్ చేసిన ఆ సినిమా రీమేక్ లో వెంకటేష్, రానా చేయబోతున్నారు.
ఈ సినిమా డైరెక్టర్ ఎవరు..? మిగతా స్టార్ కాస్ట్ ఏంటి అన్నది తెలియాల్సి ఉంది. అసలు ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అన్న విషయాలు త్వరలో వెళ్లడిస్తారని తెలుస్తుంది.