కరోనా వల్ల ప్రజలు కొందరు చాలా ఇబ్బందులు పడుతున్న విషయం తెలిసిందే. అందుకే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. పేదలకు నిత్యావసరాల లోటు లేకుండా చేస్తున్నారు. అన్ని వర్గాల వారికీ ప్రభుత్వం తరపున హామీ ఇస్తున్నారు. ఇక సెలబ్రిటీస్ లో కొందరు పీఎం కెర్స్ ఫండ్, ఏపి సీఎం రిలీఫ్ ఫండ్, టిస్ సీఎం రిలీఫ్ ఫండ్ కు తమ వంతుగా సహాయం చేస్తున్నారు.
స్మాల్ స్క్రీన్ నుండి కూడా కొందరు సెలబ్రిటీస్ తమ బాధ్యతగా విరాళాలు ఇస్తున్నారు. జబర్దస్త్ యాంకర్ రష్మి కూడా పాతిక లక్షల రూపాయలను పీఎం కెర్స్ ఫండ్ కు విరాళంగా ఇస్తున్నట్టు ప్రకటించారు. రష్మి గొప్ప మనసుకి అందరు నెటిజెన్లు మెచ్చుకుంటున్నారు. సోషల్ మీడియాలో సూపర్ యాక్టివ్ గా ఉండే రష్మి ఇలాంటి ఆపత్కర టైం లో కరెక్ట్ స్టెప్ తీసుకున్నారు.