చిరు ఆధ్వర్యంలో కరోనా క్రైసిస్ చారిటీ..!

March 30, 2020


img

కరోనా మహమ్మారి వల్ల సినీ కార్మికులు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో తెలుగు చిత్ర పరిశ్రమ పెద్దలంతా కలిసి కరోనా క్రైసిస్ ఛారిటీని స్థాపించారు. మెగాస్టార్ చిరంజీవి ఆధ్వర్యంలో తమ్మారెడ్డి భరధ్వాజ, ఎన్.శంకర్ ముఖ్య సభ్యులుగా ఉన్నారు. కరోనా వల్ల ఆశ్రయం కోల్పోయిన వారికి నిత్యావసరాలను అందించే క్రమంలో సెలబ్రిటీస్ అంతా ఒక్కతాటిపై వచ్చి కరోనా క్రైసిస్ చారిటీ ఏర్పాటు చేశారు. 

అంతేకాదు కరోనా మీద కోటి మ్యూజిక్ డైరక్షన్ లో ఒక సాంగ్ కూడా కంపోజ్ చేశారు. ఈ సాంగ్ లో మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున, సాయి తేజ్, వరుణ్ తేజ్ లు కనిపించారు. తెలుగు సినిమా పరిశ్రమకు చెంది ఇబ్బంది పడుతున్న ఆర్టిస్టులకు సహాయం చేయనున్నారు. సీసీసీకి చిరు, నాగార్జున, వరుణ్ తేజ్, సాయి తేజ్, అల్లు అర్జున్, మహేష్, ప్రభాస్ లాంటి స్టార్స్ అంతా తమ విరాళాలు అందించారు. 





Related Post

సినిమా స‌మీక్ష