నా పంచ ప్రాణాలు వీళ్ళే..!

February 18, 2020


img

యువ హీరో నితిన్, రష్మిక జంటగా ఛలో ఫేమ్ వెంకీ కుడుముల డైరక్షన్ లో వస్తున్న సినిమా భీష్మ. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో సూర్యదేవర నాగ వంశీ నిర్మిస్తున్న ఈ సినిమాకు మహతి స్వర సాగర్ మ్యూజిక్ అందించారు. ఇప్పటికే రిలీజైన సాంగ్స్ అన్ని సూపర్ హిట్ కాగా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో భాగంగా రిలెజ్ చేసిన ట్రైలర్ కూడా సినిమాపై అంచనాలు పెంచింది. ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు మాటల మాంత్రికుడు త్రివిక్రం శ్రీనివాస్ చీఫ్ గెస్ట్ గా వచ్చారు.

ఈవెంట్ లో భాగంగా నితిన్ చాలా ఎమోషనల్ గా మాట్లాడాడు. వెంకీతో సినిమా చాలా ఎంజాయ్ చేశానని చెప్పిన నితిన్ సినిమా పక్కా మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తుందని అన్నారు. ఇక కొన్నాళ్లుగా తన సినిమాల్లో డ్యాన్స్ గురించి ఫ్యాన్స్ డిజప్పాయింట్ అవుతున్నారు. అందుకే ఈ సినిమాలో అది కూడా ట్రై చేశానని.. తన ఫ్యాన్స్ కు నచ్చుతుందని అన్నారు. ఇక సినిమాలో రష్మిక చాలా బాగా చేసిందని.. తను చాలా హార్డ్ వర్కర్ అని అన్నారు నితిన్. సినిమాకు పనిచేసిన టెక్నిషియన్స్ అందరిని పేరు పేరునా ప్రస్థావించిన నితిన్ తన పంచ ప్రాణాల గురించి చెప్పాడు.   

అమ్మ, నాన్న, అక్క, పవన్ కళ్యాణ్, త్రివిక్రం వీళ్లే నా పంచ ప్రాణాలు.. కాబోయే భార్య ఆరో ప్రాణమని అన్నాడు నితిన్. పవన్ అభిమానిగా మే నెల్లో సినిమా వస్తుంది మనమందరం చొక్కాలు చించేసుకుందామని అన్నారు నితిన్. మొత్తానికి నితిన్ లో జోష్ చూస్తుంటే భీష్మతో సూపర్ హిట్ కొట్టేలా ఉన్నాడు.




Related Post

సినిమా స‌మీక్ష