మహేష్ కోసం బాలీవుడ్ భామ..!

January 24, 2020


img

సరిలేరు నీకెవ్వరు సినిమా తర్వాత సూపర్ స్టార్ మహేష్ తన 27వ సినిమా వంశీ పైడిపల్లి డైరక్షన్ లో చేస్తాడని తెలుస్తుంది. అయితే ఈ కాంబినేషన్ మూవీపై అఫిషియల్ ఎనౌన్స్ మెంట్ రావాల్సి ఉంది. ఆల్రెడీ వంశీ పైడిపల్లితో మహేష్ బాబు మహర్షి సినిమా చేసి సూపర్ హిట్ అందుకున్నాడు. మరోసారి ఈ ఇద్దరి కాంబోలో సినిమా అనగానే సూపర్ స్టార్ ఫ్యాన్స్ లో అంచనాలు పెరిగాయి. ఈసారి మహేష్ కోసం స్పై థ్రిల్లర్ కథ రాసుకున్నాడట వంశీ పైడిపల్లి.

ఈ సినిమాలో హీరోయిన్ గా బాలీవుడ్ భామ కియరా అద్వానిని సెలెక్ట్ చేశారని తెలుస్తుంది. హిందిలో సూపర్ ఫాం లో ఉన్న కియరా అద్వాని తెలుగులో భరత్ అనే నేను సినిమాతో తెరంగేట్రం చేసింది. ఆ సినిమా హిట్ అవగా ఆ తర్వాత రాం చరణ్ తో చేసిన వినయ విధేయ రామ ఫ్లాప్ అయ్యింది. అయితే మరోసారి మహేష్ సినిమాతో తెలుగులో తన సత్తా చాటాలని చూస్తుంది కియరా అద్వాని. బాలీవుడ్ లో ఆల్రెడీ సూపర్ ఫాం లో ఉన్న ఈ అమ్మడు తెలుగులో కూడా స్టార్ క్రేజ్ దక్కించుకోవాలని చూస్తుంది.


Related Post

సినిమా స‌మీక్ష