బాహుబలి తర్వాత రాజమౌళి చేస్తున్న క్రేజీ మూవీ ఆర్.ఆర్.ఆర్. మెగా పవర్ స్టార్ రాం చరణ్, యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ కలిసి చేస్తున్న ఈ మెగా మల్టీస్టారర్ సినిమాపై ఇప్పటికే తారాస్థాయిలో అంచనాలు ఉన్నాయి. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమా 400 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుందని తెలుస్తుంది. సినిమాలో హీరోయిన్స్ గా అలియా భట్, ఒలివియా మోరిస్ నటిస్తున్నారు.
అసలైతే 2020 జూలై 30న రిలీజ్ ప్లాన్ చేసిన ఈ సినిమా వాయిదా పడినట్టుగా తెలుస్తుంది. ఈ విషయాన్ని బాలీవుడ్ క్రిటిక్ తరుణ్ ఆదర్శ్ ట్వీట్ చేయడం విశేషం. అయితే ట్రిపుల్ ఆర్ వాయిదా విషయంపై చిత్రయూనిట్ నుండి మాత్రం ఎలాంటి రెస్పాన్స్ లేదు. సినిమాలో తారక్ కొమరం భీం పాత్రలో నటిస్తుండగా.. అల్లూరి సీతారామరాజుగా రాం చరణ్ నటిస్తున్నాడు.