శ్రీవారిని దర్శించుకున్న మహేష్ అండ్ టీం..!

January 17, 2020


img

సంక్రాంతికి వచ్చి సూపర్ స్టార్ మహేష్ సరిలేరు నీకెవ్వరు సినిమా సూపర్ హిట్ అందుకుంది. అనీల్ రావిపుడి డైరక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాను దిల్ రాజు, అనీల్ సుంకర కలిసి నిర్మించారు. మహేష్ కు జోడీగా రష్మిక మందన్న నటించిన ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించాడు. జనవరి 11న రిలీజైన ఈ సినిమా సక్సెస్ అయిన సందర్భంగా తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు తిరుపతి వెళ్లారు సరిలేరు నీకెవ్వరు చిత్రయూనిట్.

శుక్రవారం తెల్లవారుఝామున మహేష్ తో పాటుగా నమ్మ్రత, విజయశాంతి, దిల్ రాజు, అనీల్ రావిపుడి, రాజేంద్ర ప్రసాద్, అనీల్ సుంకర చిత్రయూనిట్ శ్రీవారిని దర్శించుకున్నారు. హన్మకొండలో ఈ సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ ప్లాన్ చేశారు. ఈరోజు సాయంత్రం చిత్రయూనిట్ మొత్తం హన్మకొండలో జరిగే విజయోత్సవ సభలో పాల్గొననున్నారు.  



Related Post

సినిమా స‌మీక్ష