పెళ్లైన ఏడాదికే విడిపోయిన జంట..!

December 10, 2019


img

కొత్తబంగారు లోకం సినిమాతో హీరోయిన్ గా పరిచయమైన శ్వేతాబసు ప్రసాద్ ఆ తర్వాత ఒకటి రెండు సినిమాలు చేసింది. తన జీవితంలో జరిగిన కొన్ని సంఘటనల వల్ల టాలీవుడ్ వదిలి వెళ్లిన శ్వేతాబసు ప్రసాద్ ముంబైలో ఓ అసిస్టెంట్ డైరక్టర్ గా చేరి తన సహ నటుడు రోహిత్ మిట్టల్ ను ప్రేమించి పెళ్లాడింది. అయితే పెళ్లై ఏడాది కూడా పూర్తి కాకముందే వీరు విడిపోతున్నట్టుగా ప్రకటించింది శ్వేతాబసు ప్రసాద్.

ఇద్దరం ఇష్టపూర్వకంగానే విడిపోతున్నామని.. ఈ ఏడాదిలో తను నాకు ఎంతో స్పూర్తి కలిగించాడని.. ప్రతిపుస్తకాన్ని మనం చదవలేం.. దానర్ధం అది చెడు పుస్తకమని కాదు.. కొన్ని విషయాలు పూర్తిగా తెలుసుకోకుండా మధ్యలో వదిలేయడమే బెటర్ అంటూ రోహిత్ మిట్టల్ గురించి రాసుకొచ్చారు శ్వేతా. అయితే ప్రేమించి పెళ్లాడిన వీరిద్దరి మధ్య ఎందుకు అంతలోనే తేడాలొచ్చాయన్న విషయంపై ముంబై మీడియా వర్గాలు ఫోకస్ పెట్టాయి. హీరోయిన్ గా మంచి భవిష్యత్తు ఉందనుకున్న శ్వేతాబసు ప్రసాద్ తను చేసుకున్న కొన్ని పొరపాట్లు వల్ల ఇలాంటి పరిస్థితుల్లో ఉండాల్సి వచ్చింది.  



Related Post

సినిమా స‌మీక్ష