ఇస్మార్ట్ శంకర్ తర్వాత మళ్లీ అతనితోనే రామ్..!

May 21, 2019


img

ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా పూరి జగన్నాథ్ డైరక్షన్ లో వస్తున్న సినిమా ఇస్మార్ట్ శంకర్. పూరి జగన్నాథ్, ఛార్మి కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది. దాదాపు షూటింగ్ ఎండింగ్ కు రాగా ఈ సినిమా తర్వాత రాం మళ్లీ మరోసారి కిశోర్ తిరుమల డైరక్షన్ లో సినిమా చేస్తాడని తెలుస్తుంది. రామ్ కిశోర్ తిరుమల కాంబినేషన్ లో నేను శైలజా, ఉన్నది ఒకటే జిందగి సినిమాలు వచ్చాయి. 

నేను శైలజా హిట్ అవగా ఉన్నది ఒకటే జిందగి ఆశించిన ఫలితాన్ని అందుకోలేదు. అయితే ఈమధ్యనే సాయి ధరం తేజ్ తో చిత్రలహరి సినిమా చేశాడు కిశోర్ తిరుమల. డబుల్ హ్యాట్రిక్ ఫ్లాపులతో సతమతమవుతున్న సాయి తేజ్ కు చిత్రలహరితో హిట్ ఇచ్చాడు కిశోర్ తిరుమల. ఇక ఈమధ్యనే రామ్ ను కలిసి ఓ లైన్ చెప్పాడట. స్టోరీ నచ్చడంతో రాం కూడా ఓకే చెప్పినట్టు టాక్. స్రవంతి రవికిశోర్ ఈ సినిమా నిర్మిస్తారని తెలుస్తుంది. మొత్తానికి కిశోర్ తిరుమల, రామ్ ఇద్దరికి ఎక్కడో బాగా కుదిరినట్టు చెప్పుకుంటున్నారు.     


Related Post

సినిమా స‌మీక్ష