యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం నటిస్తున్న సాహో సినిమాకు సంబందించి ఓ లేటెస్ట్ అప్డేట్ వచ్చింది. ఆగష్టు 15న రిలీజ్ ప్లాన్ చేసిన ఈ సినిమా నుండి మే 21న ఓ పోస్టర్ రిలీజ్ చేస్తున్నారట. సినిమాపై వచ్చిన రూమర్స్ అన్నిటికి చెక్ పెట్టేలా ఈ పోస్టర్ ఉంటుందట. సుజిత్ డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో శ్రద్ధా కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. యువి క్రియేషన్స్ బ్యానర్ లో వంశీ, ప్రమోద్ ఈ సినిమా 200 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.
యాక్షన్ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ సినిమాలో యాక్షన్ ఘట్టాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్టు తెలుస్తుంది. సినిమాకు శంకర్ ఎహసన్ లాయ్ మ్యూజిక్ అందిస్తున్నారు. సినిమా రీ షూట్స్, డైరక్టర్ హీరో గొడవ లాంటి వార్తలన్నిటికి చెక్ పెడుతూ అనుకున్న టైంకు సినిమా రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారట. ఈ సినిమా తర్వాత ప్రభాస్ జాన్ సినిమా చేస్తున్నాడు.