మెగా మేనళ్లుడు మొదలుపెట్టాడు

October 15, 2018


img

మెగా మేనళ్లుడు సాయి ధరం తేజ్ రీసెంట్ మూవీ తేజ్ ఐలవ్యూ కూడా నిరాశ పరచడంతో తన తర్వాత సినిమాకు కొద్దిపాటి గ్యాప్ తీసుకున్నాడు. ఇక ఈరోజు సాయి ధరం తేజ్ పుట్టినరోజు సందర్భంగా అతను హీరోగా కిశోర్ తిరుమల డైరక్షన్ లో వస్తున్న చిత్రలహరి మూవీ మొదలైంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో సాయి ధరం తేజ్ సరసన కళ్యాణి ప్రియదర్శిని హీరోయిన్ గా సెలెక్ట్ అయ్యింది.

కొన్నాళ్లు తన లుక్ కోసం అమెరికా వెళ్లాడని వార్తలు రాగా ప్రస్తుతం ఓపెనింగ్ రోజున సాయి ధరం తేజ్ లుక్ పెద్దగా తేడా ఏమి కనిపించలేదు. కేవలం గడ్డం ఒక్కటి పెంచాడని మాత్రం తెలుస్తుంది. నేను శైలజా, ఉన్నది ఒకటే జిందగి సినిమాల తర్వాత కిశోర్ తిరుమల డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా సాయి ధరం తేజ్ కు హిట్ ఇస్తుందో లేదో చూడాలి. ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తాడని తెలుస్తుంది.



Related Post

సినిమా స‌మీక్ష