ఎవడెవడో ఏదేదో మాట్లాడుతున్నారు.. నాకు నచ్చలే..!

April 23, 2018


img

పవన్ కళ్యాణ్ మీద యెల్లో మీడియా కుట్ర జరుగుతుందన్న విషయం మీద మెగా హీరోలు కూడా గరం గరం గా ఉన్నారు. ఇక ఈ విషయంపై వేదిక ఎలాంటిదైనా సరే తమ గళం విప్పుతున్నారు. నిన్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా వక్కంతం వంశీ డైరక్షన్ లో వస్తున్న నా పేరు సూర్య ఆడియో రిలీజ్ కార్యక్రమం జరిగింది. ఆ వేదిక మీద నాగబాబు, అల్లు అర్జున్ పవన్ మీద జరుగుతున్న కుట్ర గురించి ప్రస్థావించారు.

ముఖ్యంగా అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ పర్సనల్ మ్యాటర్స్ టచ్ చేయడం నాకు నచ్చలేదు. ఎవడెవడో ఏదేదో మాట్లాడుతున్నారు. నేను చాలా హర్ట్ అయ్యాను అంటూ భావోద్వేగంతో మాట్లాడారు. వెలిగించింది అగ్గిపుల్లే అయినా పక్కన పెట్రోల్ ట్యాంకర్ ఉందని చెప్పుకొచ్చారు. ఇలాంటి విమర్శలు చేసిన వారు.. చేయించిన వారు.. చేయించింది లక్షల మందికి చూపించిన వారి పద్ధతి నాకు నచ్చలేదు అంటూ బన్ని ఫైర్ అయ్యాడు. 

మెగా హీరోలకి ఒక్కొక్కరికి కొంతమంది ఫ్యాన్స్ ఉన్నా అందరు మెగా ఫ్యాన్సే.. అందరం ఒకటే అంటూ మెగా ఫ్యాన్స్ ఉత్సాహపరచేలా మాట్లాడాడు బన్ని. ఇక రాం చరణ్ రంగస్థలం సూపర్ హిట్ కొట్టినందుకు తన కృతజ్ఞతలు తెలియచేశాడు బన్ని. నా పేరు సూర్య ఆడియో రిలీజ్ ప్రత్యేకంగా మిలటరీ మాధవరం లో జరిగింది.  సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా జరుగనుందని తెలుస్తుంది. దాని మెగా హీరోలంతా వస్తారని అంటున్నారు.



Related Post

సినిమా స‌మీక్ష