వైఎస్సార్ 'యాత్ర'లో రమ్యకృష్ణ..!

April 21, 2018


img

మహానేత వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి జీవిత చరిత్రలోని ముఖ్య ఘట్టాలతో రాబోతున్న సినిమా యాత్ర. మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి కథానాయకుడిగా నటిస్తున్న ఈ సినిమాను మహి వి రాఘవ్ డైరెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమాలో విజయమ్మ పాత్రలో శివగామి రమ్యకృష్ణ నటిస్తుందని వార్తలు వస్తున్నాయి. అసలైతే తమిళ నటి శరణ్య విజయమ్మ పాత్రలో నటిస్తుందని అన్నారు కాని ఇప్పుడు ఆ పాత్రకు రమ్యకృష్ణతో సంప్రదింపులు చేస్తున్నారని తెలుస్తుంది.

అంతేకాకుండా ఈ సినిమాలో సూర్య, నయనతార కూడా నటించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. యాత్ర టైటిల్ తో వస్తున్న ఈ సినిమా ప్రతి ఒక్క వై.ఎస్ అభిమానికి నచ్చేలా ఉంటుందని చెబుతున్నారు. బయోపిక్ సినిమానే అయినా ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా దాదాపు 30 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కిస్తున్నారట. 

ఎలాంటి పాత్రనైనా సరే తన అభినయంతో అదరగొట్టే రమ్యకృష్ణ విజయమ్మ పాత్రలో నటిస్తే ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే సినిమా వచ్చే దాకా వెయిట్ చేయాల్సిందే. 



Related Post

సినిమా స‌మీక్ష