సాక్ష్యం టీజర్ మ్యాటర్ ఉన్నట్టుందే..!

April 18, 2018


img

బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా శ్రీ వాస్ డైరక్షన్ లో వస్తున్న సినిమా సాక్ష్యం. పూజా హెగ్దె హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను అభిషేక్ పిక్చర్స్ బ్యానర్ లో అభిషేక్ నామా నిర్మిస్తున్నారు. జయ జనాకి నాయకా సినిమాతో పర్వాలేదు అనిపించుకున్న బెల్లంకొండ శ్రీనివాస్ ఇప్పుడు సాక్ష్యంతో రాబోతున్నాడు. ఈ సినిమాకు సంబందించిన టీజర్ రిలీజ్ చేశారు.

టీజర్ చూస్తే సినిమాలో మ్యాటర్ ఉన్నట్టే అనిపిస్తుంది. తప్పు చేసిన ప్రతీవాళ్లు నాలుగు దిక్కులు చూసి తమను ఎవరూ చూడలేదని అనకుంటారని.. కానీ పైనుంచి మరో శక్తి చూస్తూ ఉంటుందని.. అదే కర్మ సాక్షి అంటూ టీజర్ లోని డైలాగ్ ఇంప్రెస్ చేస్తుంది. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా రిచ్ గా ఉన్నట్టు తెలుస్తుంది. మరి టీజర్ తో ఆకట్టుకున్న సాక్ష్యం రిలీజ్ తర్వాత ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి. 





Related Post

సినిమా స‌మీక్ష