టాలీవుడ్ సక్సెస్ ఫుల్ డైరక్టర్స్ లో ఒకరిగా పేరు తెచ్చుకున్న కొరటాల శివ సమాజానికి ఉపయోగపడే మెసేజ్ నే కమర్షియల్ పంథాలో చెబుతున్నారు. మిర్చి నుండి జనతా గ్యారేజ్ వరకు వరుస హిట్లు కొడుతున్న కొరటాల శివ ప్రస్తుతం మహేష్ తో భరత్ అనే నేను సినిమా చేస్తున్నాడు. ఇక ఈ సినిమా తర్వాత కొరటాల శివ అఖిల్ తో చేస్తున్నాడన్న వార్తలు వచ్చాయి.
అసలైతే కొరటాల శివతో అఖిల్ సినిమా చేయించాలని నాగార్జున ఆశపడ్డారట. దాదాపు 15 కోట్ల ఆఫర్ కూడా ఇచ్చాడట నాగ్. కాని అఖిల్ తో ప్రస్తుతం చేయలేనని చెప్పేశాడట కొరటాల శివ. మహేష్ తర్వాత అల్లు అర్జున్ సినిమా చేసే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. ఇక కొరటాల శివ కాదనేశాడని అఖిల్ తన 3వ సినిమాను వెంకీ అట్లూరి డైరక్షన్ లో కన్ఫాం చేశాడు.