యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో ఒక సినిమా తెరకెక్కబోతుంది. ఆ సినిమా షూటింగ్ అతి త్వరలోనే ప్రారంభం కాబోతుంది. ఇటీవలే ఈ సినిమాలో పూజా హెగ్డేను హీరోయిన్గా ఎంపిక చేయడం జరిగింది. టాలీవుడ్లో ముకుంద, ఒక లైలా కోసం సినిమాలతో ఎంట్రీ ఇచ్చిన పూజా హెగ్డే ఆ తర్వాత బాలీవుడ్కు వెళ్లింది. మళ్లీ రెండు సంవత్సరాల తర్వాత డీజే సినిమాతో వచ్చి తన అందాలతో టాలీవుడ్ ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టింది. ప్రేక్షకుల హృదయాలను మాత్రమే కాకుండా స్టార్ హీరోలను కూడా ఈమె ఆకర్షించింది. దాంతో ఈమెకు వరుసగా స్టార్ హీరోల సరసన నటించే అవకాశాలు వస్తున్నాయి. ప్రస్తుతం ఈ అమ్మడు ఎన్టీఆర్ చిత్రం కోసం రెడీ అవుతుంది.
తాజాగా ఎన్టీఆర్ సినిమాపై మీడియా వారితో స్పందిస్తూ.. త్రివిక్రమ్, ఎన్టీఆర్ల కాంబో మూవీలో హీరోయిన్గా ఎంపిక అవ్వడం పట్ల చాలా సంతోషంగా ఉందని, అతి త్వరలోనే ఎన్టీఆర్తో షూట్లో జాయిన్ కాబోతున్నట్లుగా చెప్పుకొచ్చింది. ఇదే సమయంలో ఎన్టీఆర్తో సినిమా అంటే కాస్త టెన్షన్గా ఉందని, భయంగా కూడా ఉందని చెప్పుకొచ్చింది. ఎన్టీఆర్ ఎంతటి సీన్ను అయినా సింగిల్ టేక్లోనే ఓకే చేస్తాడని, అలాంటి సీన్స్లో తాను ఎక్కువ కష్టపడాల్సి ఉంటుందని చెప్పుకొచ్చింది. ఎన్టీఆర్తో కాంబో సీన్స్ మరియు డాన్స్లకు తాను ఎక్కువ హోమ్ వర్క్ చేయాలని భావిస్తున్నట్లుగా చెప్పుకొచ్చింది. ఆయనతో సమానమైన డాన్స్లు వేయలేకపోయినా, ఆయనకు తగ్గట్లుగా చేసేందుకు ప్రయత్నిస్తాను అని చెప్పుకొచ్చింది. మొత్తానికి ఎన్టీఆర్ను ఇలా ఆకాశానికి ఎత్తేసి మంచి మార్కులు కొట్టేసిందని సినీ వర్గాల వారు అంటున్నారు.