మజ్లీస్ పార్టీ ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్ ఖాన్ బుదవారం సాయంత్రం 5గంటలకు రాజ్భవన్లో ప్రోటెం స్పీకర్ (తాత్కాలిక స్పీకర్)గా ప్రమాణస్వీకారం చేయనున్నారు. గవర్నర్ నరసింహన్ ఆయన చేత ప్రమాణస్వీకారం చేయిస్తారు. రేపటి నుంచి నాలుగు రోజులపాటు అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయి. ప్రోటెం స్పీకర్గా బాధ్యతలు చేపట్టిన ముంతాజ్ అహ్మద్ కొత్తగా ఎన్నికైన శాసనసభ్యుల చేత ప్రమాణస్వీకారాలు చేయిస్తారు. శాసనసభ్యుల ప్రమాణస్వీకారం కార్యక్రమం పూర్తికాగానే ఆదేరోజున శాసనసభ స్పీకర్ ఎన్నికకు షెడ్యూల్ ప్రకటించి నామినేషన్లు స్వీకరిస్తారు. జనవరి 18న శాసనసభ స్పీకర్ ఎన్నిక జరుగుతుంది. ఆదేరోజున స్పీకర్ బీఏసి సమావేశం నిర్వహిస్తారు.
జనవరి 19వ తేదీన కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో తొలి శాసనసభ సమావేశం జరుగుతుంది. అనవాయితీ ప్రకారం ఆరోజున గవర్నర్ నరసింహన్ ఉభయసభల సభ్యులను ఉద్దేశ్యించి ప్రసంగిస్తారు. ఆ మరునాడు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలుపుతూ తీర్మానం ప్రవేశపెట్టి దానిపై సభలో చర్చించి ఆమోదం తెలుపుతారు. జనవరి 18న శాసనసభ్యులు ప్రమాణస్వీకారం చేస్తారు కనుక అదే రోజున మంత్రివర్గం కూడా ఏర్పాటు చేసే అవకాశం ఉంది.