కోలీవుడ్ దర్శకుడు అట్లీ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చేస్తున్న సైన్స్ ఫిక్షన్ మూవీ ‘రాకా’పై ఫస్ట్ లుక్ పోస్టర్తోనే భారీ అంచనాలు సృష్టించారు. ఇప్పుడీ సినిమాలో ఒకరు ఇద్దరూ కాదు ఏకంగా నలుగురు హీరోయిన్స్ చేస్తున్నారని టాక్!
ఈ సినిమాలో మొదట బాలీవుడ్ బ్యూటీ దీపికా పడుకొణే ఒక్కరే హీరోయిన్ అనుకుంటే, ఇప్పుడు రష్మిక మందన, జాన్వీ కపూర్, మృణాల్ ఠాకూర్ కూడా హీరోయిన్లుగా నటిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయం దర్శక నిర్మాతలు ఇంకా అధికారికంగా ద్రువీకరించాల్సి ఉంది. ఈ సినిమాలో సీనియర్ నటి రమ్యకృష్ణ కూడా కీలకపాత్ర చేస్తున్నారు.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ముంబయిలో జరుగుతోంది. దీనిలో అల్లు అర్జున్ ‘రాకా’ అనే రాక్షసుడిగా, హీరోగా ద్విపాత్రాభినయం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే 40 శాతం షూటింగ్ పూర్తయినట్లు సమాచారం. 2027 వేసవిలో రాకా విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ సినిమాలో నటిస్తున్న ఇతర నటీనటులు, దీనికి పని చేస్తున్న సాంకేతిక నిపుణుల వివరాలు ఇంకా ప్రకటించాల్సి ఉంది.
సన్ పిక్చర్స్ బ్యానర్పై కళానిధి మారన్ సుమారు రూ.1,000 కోట్ల భారీ బడ్జెట్తో 9 భారతీయ భాషల్లో రాకా నిర్మిస్తున్నారు.