బోయపాటి శ్రీను దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో వస్తున్న అఖండ-2 నుంచి తాండవం పాట ప్రమో నిన్న విడుదలైంది. బాలయ్య వేషధారణ, నటన అద్భుతంగా ఉంది. పూర్తి పాట ఈ నెల 14న విడుదలవుతుంది.
కళ్యాణ చక్రవర్తి వ్రాసిన పాటకు ఎస్ఎస్ దమన్ స్వరపరిచి సంగీతం అందించగా శంకర్ మహదేవన్, కైలాష్ ఖేర్ కలిసి ఈ పాట పాడారు.
ఈ సినిమాలో సీనియర్ బాలీవుడ్ నటుడు సన్నీ డియోల్, ఆది పినిశెట్టి, సంయుక్త, ప్రగ్యా జైస్వాల్ తదితరులు ముఖ్యపాత్రలు చేస్తున్నారు.
ఈ సినిమాకు స్క్రీన్ ప్లే: కె. చక్రవర్తి రెడ్డి, డైలాగ్స్: భాను, నందు, సంగీతం: తమన్, కెమెరా: విజయ్ కార్తీక్ కణ్ణన్, ఎడిటింగ్: నిరంజన్ దేవరమనే చేస్తున్నారు.
సితారా ఎంటర్టైన్మెంట్స్, ఫార్ట్యూన్ ఫోర్ సినిమాస్, శ్రీకార స్టూడియోస్ బ్యానర్లపై గోపీ అచంట, రామ్ అచంట, బాలకృష్ణ చిన్న కుమార్తె తేజస్వి కలిసి రూ.200 కోట్ల భారీ బడ్జెట్తో అఖండ-2 నిర్మిస్తున్నారు. ఈ సినిమా డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది.