నందమూరి కళ్యాణ్ రామ్ చరణ్, విజయశాంతి తల్లీ కొడుకులుగా చేసిన అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి సినిమాకు మిశ్రమ స్పందన వస్తున్నప్పటికీ, గతంలో కర్తవ్యం సినిమాలో పోలీస్ ఆఫీసర్గా నటించిన విజయ శాంతిని మళ్ళీ ఆ పాత్రలో చూసేందుకు జనం థియేటర్లకు తరలి వెళుతున్నారు. కనుక సినిమా కలెక్షన్స్ బాగానే ఉన్నాయి. కానీ సినిమా రివ్యూలు గొప్పగా లేకపోవడం ఇబ్బందికరంగా మారింది.
ఈ సినిమా బ్లాక్ బస్టర్ సక్సస్ మీట్లో ఆమె మాట్లాడుతూ, “థియేటర్లలో చక్కగా ఆడుతూ ప్రేక్షకులను అలరిస్తున్న మా సినిమాని చంపేయాలని కొందరు సినిమా బాగోలేదంటూ చెడుగా ప్రచారం చేస్తున్నారు. ఇది సరికాదు.
ఓ సినిమా తీసేందుకు ఎంతో మంది రేయింబవళ్ళు కష్టపడతారు. కనుక సినిమా బాగోలేదనే దుష్ప్రచారం వలన వారందరూ నష్టపోతారు. ముఖ్యంగా ఎంతో నమ్మకంతో పెట్టుబడి పెట్టి సినిమా తీసిన నిర్మాత నష్టపోతారు.
మా సినిమా గురించి ఈవిదంగా పనికట్టుకొని ఎవరు ఎందుకు దుష్ప్రచారం చేస్తున్నారో కానీ ఇప్పటికైనా మానుకోకపోతే చూస్తూ ఊరుకోను. చట్ట ప్రకారం చర్యలు తీసుకోవలసి వస్తుంది. సినిమా నచ్చకపోతే చూడొద్దు కానీ చూసే వారిని చెడ గొట్టొద్దని మనవి చేస్తున్నాను.
ఒకవేళ మీకు ఎవరైనా మైండ్ వాష్ చేస్తున్నట్లయితే వెళ్ళి వారి భజన చేసుకోండి కానీ మా సినిమా జోలికి వస్తే సహించను,” అని విజయ శాంతి హెచ్చరించారు.