ప్రభాస్-మారుతి కాంబినేషన్లో సిద్దమవుతున్న రాజాసాబ్ సినిమాకి సంబందించి ఎటువంటి అప్డేట్స్ ఇవ్వకుండా దర్శకుడు మారుతి అభిమానుల సహనాన్ని పరీక్షిస్తున్నారనే చెప్పాలి. ఈ ఏడాది సంక్రాంతి పండుగ తర్వాత రాజసాబ్ హడావుడి మొదలవుతుందని మారుతి చెప్పారు. ఓ పోస్టర్ విడుదల చేశారు తప్ప ఆ తర్వాత మరేది రాలేదు. .
ఇప్పుడు రాజాసాబ్ కొత్త షెడ్యూల్ హైదరాబాద్లో మొదలైంది. ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తున్న నిధి అగర్వాల్ షూటింగ్లో పాల్గొంటోంది. ఈ షెడ్యూల్లో నిధి-ప్రభాస్లపై కొన్ని సన్నివేశాలు, ఒక పాటని చిత్రీకరించబోతున్నారు. కనుక ప్రభాస్ కూడా సెట్స్లో అడుగుపెట్టబోతున్నారు.
ఈ సినిమాలో మాళవిక మోహనన్ మరో హీరోయిన్గా నటిస్తోంది. ఫస్ట్-లుక్ పోస్టర్లో సినిమా సంగీత దర్శకుడు: ఎస్ఎస్ తమన్, కెమెరా: కార్తీక్ పళని, ఆర్ట్ డైరెక్టర్: రాజీవన్, ఎడిటింగ్: కోటగిరి వేంకటేశ్వర రావు అని చెప్పేశారు.
ప్రభాస్ సినిమా ఏదైనా ఇప్పుడు పాన్ ఇండియా మూవీగానే నిర్మించడం కామన్ అయిపోయింది కనుక ఈ సినిమాని కూడా తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో నిర్మిస్తున్నారు.
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న రాజాసాబ్ వచ్చే ఏడాది సంక్రాంతి పనుదకు విడుదలయ్యే అవకాశం ఉంది.