శ్రీరామ నవమికి ఆహా ఓటీటీలో రామ అయోధ్య

April 16, 2024


img

అయోధ్య రామ మందిరంలో బాలీవుడ్‌లో రాముడి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని టీవీ ఛానల్స్ ద్వారా దేశ విదేశాలలో హిందువులు చూశారు. అప్పటి నుంచే దేశవిదేశాల నుంచి ప్రతీరోజూ వేలాదిగా భక్తులు అయోధ్యకు వెళ్ళి బాల రాముడిని దర్శించుకుంటున్నారు.

బుధవారం శ్రీరామ నవమి సందర్భంగా ఆహా ఓటీటీలో రామ అయోధ్య అనే డాక్యుమెంటరీ ఫిల్మ్ ప్రసారం కాబోతోంది.

జాతీయ అవార్డు గ్రహీత సత్య కాశీ భార్గవ రచనను దర్శకుడు కృష్ణ రామ అయోధ్య పేరుతో డాక్యుమెంటరీ ఫిల్మ్ గా తెరకెక్కించారు. దానిలో అయోధ్య నగర విశేషాలు, రామ మందిరం నిర్మాణం, బాల రాముడి విగ్రహ ప్రతిష్టకు సంబందించి పూర్తి వివరాలను ప్రేక్షకులకు అందించబోతున్నారు. 

అయోధ్య వెళ్ళి శ్రీరాముడి దర్శనం చేసుకున్నవారు, చేసుకోలేకపోయినవారు కూడా ఈ రామ అయోధ్యా డాక్యుమెంటరీ ఫిల్మ్ ద్వారా బాల రాముడిని దర్శించుకొని మరిన్ని విశేషాలు తెలుసుకోవచ్చు.



Related Post

సినిమా స‌మీక్ష