పరశురామ్-విజయ్ దేవరకొండ కాంబినేషన్లో వచ్చిన ‘గీతాగోవిందం’ సినిమాని చూసినవారు అంతకంటే ఇంకా గొప్ప సినిమానే చూస్తామనుకొంటూ, వారి కాంబినేషన్లో ఏప్రిల్ 5న థియేటర్లలో విడుదలైన ‘ఫ్యామిలీ స్టార్’ సినిమాకి వెళ్ళారు.
‘ఫ్యామిలీ స్టార్’ బాగానే ఉన్నప్పటికీ వారి అంచనాలను అందుకోలేకపోయాడు. కనుక థియేటర్ల తదుపరి గమ్యం ఓటీటీలే కనుక ఫ్యామిలీ స్టార్ ఓటీటీలోకి వచ్చేసేందుకు సిద్దం అవుతున్నట్లు తెలుస్తోంది.
ఈ సినిమా హక్కులు అమెజాన్ ప్రైమ్ దక్కించుకొని 45 రోజుల గడువు ముగిసేందుకు ఎదురు చూస్తోంది. అయితే ఈ సినిమాని థియేటర్ల నుంచి తీసేస్తుండటంతో మే 3వ తేదీన లేదా ఇంకా ముందే ప్రసారం చేసేందుకు అమెజాన్ ప్రైమ్ సిద్దపడుతోంది. బహుశః వచ్చే వారంలో దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై దిల్రాజు, శిరీష్, వాసువర్మలతో కలిసి నిర్మించిన ఈ సినిమాకి సంగీతం: గోపీ సుందర్, కెమెరా: కెయు మోహన్, ఆర్ట్: ఏఎస్ ప్రకాష్, ఎడిటింగ్: మార్తాండ్ కె వెంకటేష్ చేశారు.