కొన్ని సినిమాలలో పాత్రలు ప్రేక్షకులకు చాలా కాలం గుర్తుండిపోతాయి. మహానటి సినిమాలో కీర్తి సురేష్ చేసిన సావిత్రి పాత్ర, సీతారామం సినిమాలో మృణాల్ ఠాకూర్ చేసిన సీతామహాలక్ష్మి పాత్ర అటువంటివే అని చెప్పుకోవచ్చు. ప్రేక్షకులే ఆ పాత్రలు మరిచిపోలేనప్పుడు ఇక వాటిని చేసిన నటీనటులు మరిచిపోగలరా? అంటే కష్టమే అంటోంది సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్.
ఆ సినిమా షూటింగ్ పూర్తయిన రోజున ఏదో తెలియని బాధ కలిగిందని దాని నుంచి బయటపడేందుకు తనకు చాలా రోజులు పట్టిందని మృణాల్ ఠాకూర్ చెప్పారు. అటువంటి పాత్రలు చాలా అరుదుగా లభిస్తాయని, మళ్ళీ అటువంటి అవకాశం వస్తే తప్పక చేస్తానని అన్నారు. అయితే నటనకు ఆస్కారం ఉండే పాత్రలతో పాటు గ్లామర్ పాత్రలు కూడా చేయాలనుకుంటున్నానని కానీ తెలుగులో అటువంటి అవకాశం ఇంకా రాలేదని మృణాల్ ఠాకూర్ అన్నారు.
సినీ పరిశ్రమలో తనకు గాడ్ ఫాదర్ దుల్కర్ సల్మాన్ అని, ఆయన సూచనలతోనే చక్కటి కధలను ఎంచుకొని సినిమాలు చేస్తున్నానని మృణాల్ ఠాకూర్ చెప్పారు. సీతారామం సినిమాలో వారిద్దరు ప్రధాన పాత్రలు చేసిన సంగతి తెలిసిందే.