కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటించిన ‘జైలర్’ సినిమా రూ.600 కోట్లుకు పైగా కలెక్షన్ రాబట్టి సూపర్ హిట్ అయ్యింది. ఆ సినిమాకు దర్శకత్వం వహించిన నెల్సన్ దిలీప్ కుమార్ ఇప్పుడు దానికి సీక్వెల్గా మరో సినిమా తీసేందుకు కధ సిద్దం చేసుకొని రజినీకి వినిపించగా దానికి ఆయన ఓకే చెప్పారు. ఈ సినిమాకు ‘హుకుం’ అని టైటిల్ ఖరారు చేసిన్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం రజినీకాంత్ జ్ఞానవేల్ దర్శకత్వంలో వెట్టాయన్ (తెలుగు వెర్షన్ పేరు వేటగాడు) సినిమా చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ 80 శాతం పూర్తయింది. దాని తర్వాత లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో మరో సినిమా చేయాల్సి ఉంది.
కనుక ఆ సినిమా కూడా పూర్తి చేసిన తర్వాత ‘హుకుం’ మొదలుపెడతారా లేదా లోకేశ్ కనగరాజ్ సినిమాని పక్కన పెట్టి ‘హుకుం’ మొదలుపెడతారా? అనే విషయం ఇంకా తెలియవలసి ఉంది.
జైలర్ సినిమాలో రజినీ తన వయసుకు తగ్గ పాత్ర చేసినప్పటికీ తన మార్క్ యాక్షన్, పంచ్ డైలాగులతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. హుకుం సినిమాలో అంతకు మించి ఉండబోతోందని తెలుస్తోంది.