గోపీచంద్ విశ్వం... ఫస్ట్ స్ట్రైక్ ఇలా ఉందేమిటో?

April 12, 2024


img

గోపీచంద్, కావ్య థాపర్ జంటగా శ్రీను వైట్ల దర్శకత్వంలో ‘విశ్వం’ షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. విశ్వం ‘ఫస్ట్ స్ట్రైక్’ పేరుతో టీజర్‌ విడుదల చేశారు. 

ఓ వివాహ కార్యక్రమం జరుగుతుంటే, గోపీచంద్ తుపాకీతో పెళ్ళి కొడుకుతో సహా అక్కడున్న అందరినీ కాల్చేస్తాడు. తర్వాత అతిధుల కోసం వండిన ఆహారాన్ని తింటూ “ప్రతీ గింజపై తినేవాడి పేరు వ్రాసి ఉంటుంది. దీనిపై నాపేరు ఉంది,” అని డైలాగ్‌ చెప్తాడు. ఈ సినిమాలో గోపీచంద్ విలన్‌గా నటిస్తున్నట్లు ఎక్కడా చెప్పలేదు. కానీ ఈ‘ఫస్ట్ స్ట్రైక్’ చూసినప్పుడు, అటువంటి సందేహమే కలుగుతుంది.  

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, చిత్రాలయం అసోసియేషన్స్ బ్యానర్లపై టిజి విశ్వప్రసాద్, వివేక్‌ రామస్వామి కూచిభొట్ల నిర్మిస్తున్న విశ్వం సినిమాకి కధ: గోపీ మోహన్, భాను-నందు, ప్రవీణ్ వర్మ, సంగీతం: చేతన్ భరద్వాజ్, కెమెరా: కేవీ గుహన్, యాక్షన్: రవి వర్మ, దినేష్ సుబ్బరాయన్, కొరియోగ్రఫీ: శేఖర్ మాస్టర్, ఆర్ట్: కిరణ్ కుమార్‌ మన్నే, ఎడిటింగ్: అమర్ రెడ్డి కుడుముల చేస్తున్నారు.



Related Post

సినిమా స‌మీక్ష