వెంకటేష్-అనిల్ రావిపూడి కామెడీ కాదు... క్రైమ్ స్టోరీ అట!

April 12, 2024


img

విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో 2019లో ఎఫ్-2 తీస్తే సూపర్ హిట్ అయ్యింది. దానికి సీక్వెల్‌గా 2022లో ఎఫ్-3 తీస్తే అది కూడా సూపర్ హిట్ అయ్యింది. రెండేళ్ల తర్వాత మళ్ళీ వాళ్ళిద్దరి కాంబినేషన్‌లో మరో సినిమా చేయబోతున్నారు.

మొన్న ఉగాది పండుగ సందర్భంగా అనిల్ రావిపూడి ఈ కొత్త సినిమా గురించి సోషల్ మీడియాలో తెలియజేశారు. అయితే ఇది ఎఫ్-2, ఎఫ్-3 సినిమాల్లాగా కామెడీ కాదని, ఓ మాజీ పోలీస్ అధికారి, మాజీ గర్ల్ ఫ్రెండ్, భార్య మద్య జరిగే ముక్కోణపు క్రైమ్ స్టోరీ అని ముందే చెప్పేశారు.

ఈ సినిమాని శ్రీ వేంకటేశ్వర క్రియెషన్స్ బ్యానర్‌పై దిల్‌రాజు నిర్మించబోతున్నారు. త్వరలోనే ఈ సినిమాకు సంబందించి పూర్తి వివరాలు ప్రకటిస్తామని దర్శకుడు అనిల్ రావిపూడి తెలిపారు. 

శైలేశ్ కొలను దర్శకత్వంలో వెంకటేష్ చేసిన సైంధవ్ సినిమా సంక్రాంతి పండుగ సీజన్‌లో విడుదలైంది కానీ పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. దాని తర్వాత ఇప్పుడు ఈ సినిమా చేయబోతున్నారు.


Related Post

సినిమా స‌మీక్ష