కొరటాల శివ దర్శకత్వంలో జూ.ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న ‘దేవర’ గోవా షెడ్యూల్ షూటింగ్ పూర్తయిందని హీరోయిన్గా నటిస్తున్న జాన్వీ కపూర్ సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది. షూటింగ్ చాలా అద్భుతంగా సాగిందని మళ్ళీ సెట్స్లో ఎప్పుడు అడుగు పెడతానా అని ఆతృతగా ఎదురు చూస్తున్నానని జాన్వీ కపూర్ మెసేజ్ పెట్టింది.
గోవా షెడ్యూల్లో జూ.ఎన్టీఆర్, జాన్వీ కపూర్ మీద ఓ రొమాంటిక్ సాంగ్, కొన్ని ముఖ్య సన్నివేశాలు చిత్రీకరించారు. ఈ సినిమాతోనే టాలీవుడ్లో అడుగుపెట్టిన జాన్వీ కపూర్ అప్పుడే రామ్ చరణ్తో మరో సినిమా చేయబోతోంది.
గోవా షెడ్యూల్ తర్వాత విదేశాలకు వెళ్ళి నాలుగు పాటలను షూట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. దేవరలో బాలీవుడ్ నటుడు సైఫ్ ఆలీఖాన్, ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, నారాయణ్, రమ్యకృష్ణ, చైత్ర రాయ్, కలైయరసన్, షైన్ టామ్ చాకో తదితరులు ముఖ్య పాత్రలు చేస్తున్నారు.
ఈ సినిమాకు కధ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: కొరటాల శివ, సంగీతం: అనిరుధ్ రవిచంద్ర, కెమెరా: ఆర్.రత్నవేలు, ఎడిటింగ్: ఏ. శ్రీకర్ ప్రసాద్ చేస్తున్నారు.
యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లపై సుధాకర్ మిక్కిలినేని, కొసరాజు హరికృష్ణ, నందమూరి కళ్యాణ్ రామ్ కలిసి రూ.300 కోట్ల భారీ బడ్జెట్తో దేవర సినిమాను నిర్మిస్తున్నారు. ఈ ఏడాది అక్టోబర్ 10న దసరా పండుగకు దేవర మొదటి భాగం విడుదల కాబోతోంది.