'సర్కారు వారి పాట' ట్విట్టర్ ట్రెండింగ్

June 01, 2020


img

సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు సందర్భంగా సూపర్ స్టార్ మహేష్ కొత్త సినిమా టైటిల్ పోస్టర్ రిలీజ్ చేశారు. గీతా గోవిందం సినిమాతో హిట్ అందుకున్న పరశురామ్ డైరక్షన్ లో మహేష్ హీరోగా వస్తున్న సినిమాకు సర్కారు వారి పాట అని టైటిల్ పెట్టారు. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ కలిసి నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో మహేష్ సరసన కియరా అద్వానీ హీరోయిన్ గా నటించే ఛాన్స్ ఉందని తెలుస్తుంది. 

ఇలా టైటిల్ పోస్టర్ రిలీజ్ అయ్యిందో లేదో అలా వైరల్ గా మారింది. అంతేకాదు ప్రీ లుక్ పోస్టర్ లో ఫాస్టెస్ట్ మిలియన్ మార్క్ అందుకున్న రికార్డ్ సర్కారు వారి పాట అందుకుంది. అంతేకాదు 24 హావర్స్ లో కూడా ఏ ప్రీ లుక్ పోస్టర్ కు రాణి వ్యూస్, రీ ట్వీట్స్ తో మహేష్ మరోసారి దుమ్ముదులిపేశాడు. భరత్ అనే నేను, మహర్షి, సరిలేరు నీకెవ్వరు సినిమాలతో వరుస హిట్లు అందుకున్న మహేష్ సర్కారు వారి పాట సినిమాతో మరో సంచలనం సృష్టించనున్నాడని తెలుస్తుంది. మరి ఈ సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి. ప్రీ లుక్ లో మహేష్ గెడ్డం లుక్, చెవికి పోగు, మెడ మీద రూపాయి ట్యాటూ చూస్తుంటే పోకిరి తర్వాత మహేష్ మాస్ అవతార్ గా కనిపించే ఈ సినిమా సూపర్ స్టార్ ఫ్యాన్స్ కు పండుగ తెచ్చేలా ఉంది. 



Related Post

సినిమా స‌మీక్ష