సెట్ లో గొడవ పడ్డ అల్లు అర్జున్..!

July 20, 2019


img

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నా పేరు సూర్య తర్వాత కొద్దిపాటి గ్యాప్ తో చేస్తున్న సినిమా ప్రస్తుతం సెట్స్ మీద ఉంది. త్రివిక్రం డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో బన్ని సరసన పూజా హెగ్దె హీరోయిన్ గా నటిస్తుంది. సినిమాలో అక్కినేన్ హీరో సుశాంత్, నివేదా పేతురాజ్ లు కూడా నటిస్తున్నట్టు తెలుస్తుంది. ఇదిలాఉంటే షూటింగ్ టైంలో హీరో అల్లు అర్జున్ కి, సినిమా కో డైరక్టర్ కు మధ్య గొడవ జరిగిందట.

ఈ గొడవ పెద్దదవడం వల్ల సినిమా షూటింగ్ కూడా క్యాన్సిల్ అయ్యిందట. అయితే ఇష్యూ పెద్దదవకముందే త్రివిక్రం వచ్చి సమస్య సాల్వ్ చేసినట్టు తెలుస్తుంది. ఇండస్ట్రీలో సీనియర్ కో డైరక్టర్ ఈ సినిమాకు పనిచేస్తున్నాడట. గొడవ ఏదైనా బన్ని ఈగో కూడా హర్ట్ అయినట్టు తెలుస్తుంది. 2020 సంక్రాంతి బరిలో దిగుతున్న ఈ సినిమాను హారిక హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ కలిసి నిర్మిస్తున్నారు.  



Related Post

సినిమా స‌మీక్ష