కేరళ వరద బాధుతులకు ఇంకా సహాయక చర్యలు జరుగుతూనే ఉన్నాయి. వరదల వల్ల భారీ ఆస్తి నష్ట జరుగగా నష్ట నివారణ చర్యల్లో ప్రభుత్వం తలమునకలవుతుంది. ఇక కేరళకు సాయంగా సిని పరిశ్రమ నుండి భారీ మొత్తం విరాళంగా సెలబ్రిటీస్ అందించారు. ప్రస్తుతం సుమ దంపతులు రాజీవ్ కనకాల, సుమలు కేరళ వరద పాంత్రంలో ఒకటైన అలప్పిలో ఓ బిల్డింగ్ ను దత్తత తీసుకున్నారు.
బిల్డింగ్ దత్తత తీసుకోవడం ఏంటని ఆశ్చర్యపోవచ్చు. వరదల కారణంగా కొన్ని బిల్డింగులు నేలమట్టం కాగా కొన్ని సగానికి పైగా డ్యామేజ్ అయ్యాయి. అలప్పీలో ఫ్యామిలీ వెల్ఫేర్ సెంటర్ నడిపిస్తున్న ఓ బిల్డింగ్ చాలా వరకు డ్యామేజ్ అయ్యింది. ఆ బిల్డింగ్ ను మళ్లీ నిర్మించే బాధ్యత మీద వేసుకున్నారు సుమ దంపతులు. అక్కడ కలక్టర్ సాయంతో ఆ వివరాలను వారు తెలుసుకుని దానికి కావాల్సిన మొత్తాన్ని వీరు సమకూరుస్తున్నారట.
కేరళ ప్రాంతానికి చెందిన సుమ తెలుగులో యాంకర్ గా స్థిరపడినా పుట్టి పెరిగిన ప్రదేశం కోసం కరెక్ట్ టైంలో కరెక్ట్ స్టెప్ తీసుకుందని అందరు అంటున్నారు. మిగతా వారు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని కోరుకున్నారు రాజీవ్ కనకాల దంపతులు.