వైన్ షాపులపై మీ పెత్తనం ఏమిటి రెడ్డిగారు?

January 23, 2026


img

మునుగోడు కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి దక్కకపోవడంతో తీవ్ర అసహనంతో రగిలిపోతున్నారు. కనుక తన ప్రతాపం మునుగోడులోని  వైన్ షాపులపై చూపుతున్నారు. తన నియోజకవర్గంలో వైన్ షాపులు మధ్యాహ్నం ఒంటి గంటకు, పర్మిట్ రూములు సాయంత్రం 6 గంటలకు మాత్రమే తెరవాలని హుకుం జారీ చేశారు.

అలాగే ఊళ్ళో వైన్ షాపులు ఉండరాదని అన్నీ ఊరు శివారులో మాత్రమే ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించారు. మునుగోడులో వైన్ షాప్ లైసెన్సులు పొందిన అందరూ తప్పనిసరిగా తన నియమ నిబంధనలు పాటించాల్సిందేనని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హుకుం జారీ చేశారు. ఆయన అనుచరులు బలవంతంగా వాటిని అమలు చేయిస్తున్నారు.

రెండు రోజుల క్రితం సంస్థాన్ నారాయణపూర్‌లో ఓ వైన్ షాప్ యజమాని తమ నిబంధనలు ఉల్లంగించినందుకు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అనుచరులు దాడి చేసి బలవంతంగా మూయించేశారు. వారి ఆగడాలు మితిమీరడంతో వైన్ షాపుల యజమానులు ఎక్సైజ్ శాఖ అధికారులకు పిర్యాదు చేశారు. వారు ఈరోజు ఉదయం అక్కడకు చేరుకొని వైన్ శాపులని తెరిపించారు. అయితే వారు ప్రతీరోజూ అక్కడ కాపలా ఉండలేరు. కనుక వారు అటు వెళ్ళగానే మళ్ళీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అనుచరులు వచ్చి వైన్ షాపులు మూయించకుండా ఉంటారా? కనుక ఈ సమస్యని ప్రభుత్వమే పరిష్కరించాల్సి ఉంటుంది.



Related Post