ఇక భారత్‌, పాక్‌ డ్రోన్లు లెక్కపెట్టుకోక తప్పదేమో?

May 09, 2025


img

భారత్‌ దళాలు ఆపరేషన్ సింధూర్‌ విజయవంతంగా నిర్వహించినప్పటి నుంచి పాకిస్థాన్‌ నిరంతరంగా దాడులు చేస్తూనే ఉందని భారత్‌ విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ చెప్పారు.

గురువారం రాత్రి ఒక్కపూటే సుమారు 300-400 డ్రోన్లు భారత్‌ మీద ప్రయోగించిందని, వాటిలో చాలా వరకు కూల్చివేశామని కర్నల్ సోఫియా ఖురేషీ చెప్పారు. వాటి శకలాలను పరిశీలించగా అవన్నీ టర్కీ తయారు చేసిన ‘ఆసిస్ గార్డ్ సొంగర్’ డ్రోన్లుగా గుర్తించామని చెప్పారు. 

వాటిని ప్రధానంగా గూడచర్యం, సైనిక స్థావరాలపై దాడులకు వినియోగిస్తారని తెలిపారు. భారత్‌ సైనిక స్థావరాలతో పాటు ప్రార్ధనా మందిరాలు, సామాన్య ప్రజల ఇళ్ళపై దాడులకు ఉపయోగించిందని కర్నల్ సోఫియా ఖురేషీ చెప్పారు. కనుక పాక్‌ డ్రోన్ దాడిలో పలువురు ప్రజలు గాయపడ్డారని తెలిపారు. 

సరిహద్దు జిల్లాలలో ప్రార్ధన మందిరాలపై పాక్‌ డ్రోన్లతో దాడులు చేస్తూ, భారత్‌ సైన్యమే ఆ దాడులు చేస్తోందని దుష్ప్రచారం చేస్తూ, దేశంలో మత ఘర్షణలకు ప్రయత్నిస్తోందని, ప్రపంచ దేశాలను తప్పు దారి పట్టించాలని ప్రయత్నిస్తోందని కర్నల్ సోఫియా ఖురేషీ ఆరోపించారు.

పాకిస్థాన్‌ దాడులను భారత్‌ సమర్ధంగా ఎదుర్కొంటోందని, కాని పాక్‌ కపట యుద్ధం చేస్తోందని కర్నల్ సోఫియా ఖురేషీ అన్నారు. భారత్‌ గగనతలం మూసివేసినప్పటికీ పాక్‌ పౌర విమానాలు అత్యంత సమీపం నుంచి ప్రయాణిస్తున్నాయని, భారత్‌ వాయుసేన వాటిని గుర్తించినప్పటికీ, వాటిలో సామాన్య పౌరులు ప్రయాణిస్తున్నారనే ఏకైక కారణంతో సంయమనం పాటిస్తోందని కర్నల్ సోఫియా ఖురేషీ చెప్పారు. పౌర విమానాలు అడ్డం పెట్టుకొని భారత్‌పై దాడులు చేయాలని ప్రయత్నిస్తోందని కర్నల్ సోఫియా ఖురేషీ ఆరోపించారు. 

ఏది ఏమైనప్పటికీ ఇరు దేశాల మద్య యుద్ధం మొదలైంది కనుక ఇక డ్రోన్లు, కూలిన యుద్ధ విమానాలను, పడిన బాంబు శకలాలను లెక్కపెట్టుకోవాలేమో? 


Related Post