భారత్‌లో పెరుగుతున్న కరోనా కేసులు, మరణాలు

April 25, 2022
img

భారత్‌లో మళ్ళీ క్రమంగా కరోనా కేసులు, మరణాల సంఖ్య పెరుగుతోంది. గత 24 గంటలలో దేశవ్యాప్తంగా కొత్తగా 2,541 కేసులు నమోదు కాగా 30 మంది చనిపోయారు. నెలరోజుల క్రితం 4000 దిగువన ఉండే యాక్టివ్ కేసులు మళ్ళీ ఇప్పుడు 16,522కి పెరిగాయి. ప్రస్తుతం రోజువారీ పాజిటివిటీ రేటు 0.84 శాతానికి చేరగా మరణాలు 1.21 శాతానికి పెరిగాయి. రికవరీ రేటు మాత్రం 98.75 శాతం ఉండటం చాలా ఉపశమనం కలిగించేదే. 

దేశంలో మళ్ళీ కరోనా ఉదృతి పెరుగుతున్నందున అన్ని రాష్ట్రాలు, ప్రజలందరూ కూడా కరోనా జాగ్రత్తలు పాటించాలని, తప్పనిసరిగా వాక్సిన్లు వేసుకోవాలని కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్‌ భూషణ్‌ విజ్ఞప్తి చేశారు. ఈనెల 27న ప్రధాని నరేంద్రమోడీ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమయ్యి కరోనా పరిస్థితిని సమీక్షించనున్నారు.    


Related Post