గృహావసరాలకు వినియోగించే ఎల్పీజీ గ్యాస్ సిలిండర్తో పాటు డీజిల్, సీఎన్జీ ధరలు నేటి నుంచి పెరిగాయి. ఆయిల్ కంపెనీలకు నష్టాలు వస్తున్నందున ధరలు పెంచక తప్పడం లేదని కేంద్ర చమురు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీ తెలిపారు. పెంచిన ధరలు నేటి నుంచే దేశవ్యాప్తంగా అమలులోకి వస్తాయని తెలిపారు.
గృహావసరాలకు వినియోగించే ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధర నేటి నుంచి రూ.50 చొప్పున పెరుగుతుంది. ఉజ్వల పధకంలో రాయితీపై ఇస్తున్న గ్యాస్ సిలిండర్లకి కూడా ఈ పెంపు వర్తిస్తుంది.
పెట్రోల్, డీజిల్ లీటర్ రూ.2 చొప్పున పెరుగుతుంది. సీఎన్జీ ధర కిలోపై ఒక్క రూపాయి చొప్పున పెరుగుతుంది. వీటితో పాటు పెంచుతున్నట్లు కేంద్రం ప్రకటించారు.
పెట్రోల్, డీజిల్ కేంద్రం 2 శాతం ఎక్సైజ్ సుంకం విధించింది. అయితే సామాన్య ప్రజలపై ఈ భారం పడదని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ తెలిపారు.
దీంతో లీటర్ పెట్రోల్పై రూ.21.90, డీజిల్పై రూ.15.80 చొప్పున ఎక్సైజ్ పన్నుల ద్వారా కేంద్రానికి రూ.32,000 కోట్ల అదనపు ఆదాయం లభిస్తుందని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ తెలిపారు.
గ్యాస్, పెట్రోల్. డీజిల్ ధరలు పెరిగితే సరుకు రవాణా, ప్రజా రవాణా (బస్సులు, ట్రావెల్స్, ఆటోలు, క్యాబ్ వగైరా) ధరలు కూడా పెరుగుతాయి. సరుకు రవాణా ఛార్జీలు పెరిగితే నిత్యావసర సరుకుల ధరలు పెరుగుతాయి. కనుక దేశంలో సామాన్య, మద్య తరగతి ప్రజలకి ఈ పెంపుతో చాలా భారం కాబోతోంది.